ఆంధ్ర రైతులకు శుభవార్త దీపావళి కానుకగా 2వ విడత Rs.5,000 విడుదల, కౌలు రైతులకు Rs.10,000 ప్రత్యేక కానుక! | Annadatha Sukhibhava 2nd Installment Diwali Gift 5000
రాష్ట్రంలోని అన్నదాతలకు దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఒక పెద్ద కానుకను ప్రకటించారు. అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులను అక్టోబర్ 18, 2025న రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే Rs.5,000 తో పాటు, కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ Rs.2,000 కలిపి, అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి మొత్తం Rs.7,000 ఆర్థిక సాయం అందుతుంది.
Annadatha Sukhibhava 2nd Installment నిధులు మొత్తం Rs.5,000 నేరుగా రైతులకు అందించడం ద్వారా, పంట పెట్టుబడి కోసం అదనపు ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వం తెలిపింది. ఆగస్టులో మొదటి విడత నిధులు అందుకున్న రైతులందరికీ ఈ 2వ విడత కూడా వర్తిస్తుంది. మొత్తంగా, ఈ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు సంవత్సరానికి Rs.14,000 ఆర్థిక సహాయం లభిస్తుంది.
కౌలు రైతులకు ప్రత్యేకంగా Rs.10,000 చెల్లింపు
అన్నదాత సుఖీభవ 2వ విడత కింద రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులకు ప్రభుత్వం మరింత పెద్ద శుభవార్త చెప్పింది. భూమి యాజమాన్యం లేని కౌలు రైతుల కోసం ప్రత్యేకంగా సంవత్సరానికి Rs.20,000 అందించే ఈ పథకం కింద, అక్టోబర్ నెలలో మొదటి విడతగా ఏకంగా Rs.10,000 నేరుగా వారి ఖాతాల్లో జమ కానుంది. ఈ లబ్ధి పొందడానికి, కౌలు గుర్తింపు కార్డు (Tenant Card) మరియు e-Cropలో పంట వివరాల నమోదు తప్పనిసరి. ఈ నిర్ణయం రాష్ట్రంలోని 5.9 లక్షల మంది కౌలు రైతులకు గొప్ప ఊరటనిస్తుంది.
అర్హత ప్రమాణాలు మరియు స్టేటస్ చెక్ వివరాలు
Annadatha Sukhibhava 2nd Installment నిధులు పొందడానికి రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి. చిన్న, సన్నకారు రైతులు (5 ఎకరాల లోపు భూమి) మాత్రమే అర్హులు. ఇప్పటికే 46.64 లక్షల రైతు కుటుంబాలు ఈ పథకానికి అర్హులుగా గుర్తించబడ్డాయి. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, మరియు ప్రజాప్రతినిధులు ఈ పథకానికి అనర్హులుగా మిగిలిపోతారు. రైతులు తమ అర్హత మరియు నిధుల విడుదల స్టేటస్ను అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది.
Annadatha Sukhibhava Official Web Site – Click Here